అక్షరటుడే,కోటగిరి : Pothangal mandal | భర్త మందలించాడని మనస్థాపంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన పోతంగల్ మండల (Pothangal mandal) కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది.
పోతంగల్ ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సాయిలు, సూదాం గంగామణి భార్యాభర్తలు. ఇంటి ఎదుట పాతిన ఓ కర్ర విషయంలో వీరికి వాగ్వాదం జరిగింది. భర్త మందలించడంతో మనస్థాపం చెందిన గంగామణి మంగళవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది. బుధవారం చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. కొడుకు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.