అక్షరటుడే, వెబ్డెస్క్ : IPL Final | క్రికెట్ ప్రేమికులకు ఎంతో ఎంటర్టైన్ చేసిన ఐపీఎల్ నేటితో ముగియనుంది. మరికొద్ది సేపట్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), పంజాబ్ కింగ్స్(PBKS) మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ (Ahmadabad) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. ఇప్పటి వరకు ఆర్సీబీ మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన కప్పు దక్కించుకోలేకపోయింది. కాగా పంజాబ్ రెండో సారి ఫైనల్ ఆడుతోంది. ఏ జట్టు గెలిచినా తొలిసారి కప్పు అందుకోనుంది. ఈ ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారోనని ఐపీఎల్ అభిమానులను టీవీలకు అతుక్కుపోయారు.