అక్షరటుడే, వెబ్డెస్క్: Banakacharla | తెలంగాణతో ప్రాజెక్ట్లో విషయంతో తాను పోరాటం చేయనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణతో తాను ఎప్పుడైనా గొడవపడ్డానా అని ఆయన పేర్కొన్నారు. ‘‘కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే వాడుకుంటాం’’ అని వ్యాఖ్యలు చేశారు.
బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదని చంద్రబాబు అన్నారు. ఎవరి నీరు వారిదని, అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందామని బాబు అన్నారు. సముద్రంలోకి పోయే నీటి వాడకంపై సమస్యలు సృష్టించడం సరికాదన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో నీటిని వాడుకుందామని ఆయన పేర్కొన్నారు.
Banakacharla | ఏ ప్రాజెక్ట్కు అనుమతి లేదు
ప్రస్తుతం గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్కు తప్ప మిగతా వాటికి అనుమతి లేదని ఆయన తెలిపారు. ఎవరి శక్తి మేర వారు ప్రాజెక్ట్లు కట్టుకుందామని ఆయన సూచించారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్కు అనుమతులు ఇవ్వొద్దని సీఎం రేవంత్రెడ్డి గురువారం కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి విన్నవించారు. ఈ క్రమంలో చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు చర్చించుకొని వాడుకుందామన్నారు. ఎవరు ఎవరితో పోరాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. కొత్త అథారిటీ నీటిని ఎలా కేటాయిస్తే అలా వాడుకుందామని చంద్రబాబు పేర్కొన్నారు.