అక్షరటుడే, వెబ్డెస్క్:PCC Chief | వరంగల్లో జరిగింది వీస్కీ బాటిళ్ల(Whiskey bottle) మీటింగ్ అంటూ పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ pcc chief Mahesh Kumar goud విమర్శించారు. బీఆర్ఎస్ రజతోత్సవ(BRS Silver Jubilee) సభలో కేసీఆర్(KCR) చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గులాబీ బాస్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘ప్రజలతో తిరస్కరించబడి.. ఫాంహౌస్ పరిమితమై.. ప్రభుత్వ జీతం తీసుకుంటూ.. ప్రజల గురించి ఒక్క రోజు కూడా ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి(Former Chief Minister) కేసీఆర్’ అని పేర్కొన్నారు. ఆయన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వరంగల్ జరిగింది విస్కీ బాటిళ్ల సమావేశమని ఎద్దేవా చేశారు. సభలో జనం కన్నా ఎక్కువ విస్కీ బాటిళ్లే ఉన్నాయని అందరూ చెబుతున్నారని వ్యాఖ్యానించారు.
PCC Chief | చర్చకు సిద్ధం
కాంగ్రెస్ పాలనలో చేసిన పనులపై కేసీఆర్(KCR) ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధమని.. సమయం, వేదిక మీరే డిసైడ్ చేయండంటూ సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 15 నెలల కాంగ్రెస్ పాలనలో చేసిన పనులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేసీఆర్ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంతో ప్రజాధనాన్ని అత్యంత ఎక్కువగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబమేనని విమర్శించారు. దూరదృష్టి, ఆలోచన లేకుండా ఇష్టారాజ్యంగా అప్పులు చేసి పలాయనం చిత్తగించిన వ్యక్తి కాంగ్రెస్(Congress Government) గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.