అక్షరటుడే, వెబ్డెస్క్: Inter Supplementary Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థులు(Students) నిరీక్షిస్తున్నారు. పరీక్షల్లో తప్పిన వారితో పాటు ఇంటర్ ఫస్టియర్లో మార్కులు పెంచుకోవడానికి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు(Supplementary Exams) రాశారు. వీరందరూ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో ఇంటర్ బోర్డు(Inter Board) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 16న ఫలితాలు విడుదల చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో మే 22 నుంచి 30 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం అయిపోయింది. దీంతో సోమవారం ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.