More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Inter Supplementary exams | ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..

    Inter Supplementary exams | ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Inter Supplementary exams |తెలంగాణలో ఇంటర్​ పరీక్ష ఫలితాలు ఏప్రిల్​ 22న విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్​ ఫస్టియర్​లో 65.96 శాతం, సెకండియర్​లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. అయితే ఈ పరీక్షల్లో ఫెయిల్​ అయిన వారికి త్వరలో సప్లిమెంటరీ పరీక్షలు(Supplementary exams) నిర్వహించనున్నారు. మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు త్వరలోనే హాల్​టికెట్లు కూడా విడుదల కానున్నాయి.

    సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఫస్టియర్‌ జనరల్‌ విద్యార్థులు 2,49,032 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. ఫస్టియర్​ విద్యార్థుల్లో ఫెయిల్​ అయిన వారితో పాటు మార్కులు పెంచుకోవడానికి ఇంప్రూవ్​మెంట్(Improvement)​ రాసే వారు కూడా ఉంటారు. సెకండియర్​ సప్లిమెంటరీ పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 1,34,341 మంది, ఒకేషనల్‌ పరీక్షలకు 12,357 మంది హాజరుకానున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి 29 వరకు కొనసాగనున్నాయి.

    READ ALSO  Harish Rao | తప్పుడు కేసులు పెట్టి కౌశిక్​రెడ్డిని అరెస్ట్​ చేశారు : హరీశ్​రావు

    Inter Supplementary exams | టైం టేబుల్​ ఇదే..

    ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం ఫస్టియర్​ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్​ విద్యార్థులు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

    మే 22న సెకండ్​ లాంగ్వేజీ, 23న ఇంగ్లిష్​ పరీక్ష ఉంది. 24న మ్యాథ్స్​–ఏ, బోటని, పొలిటికల్​ సైన్స్​, 25న మ్యాథ్స్​ బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు ఉన్నాయి. 26న ఫిజిక్స్​, ఎకనామిక్స్​, 27న కెమిస్ట్రీ, కామర్స్, 28న పబ్లిక్​ అడ్మినిస్ట్రేషన్​, బ్రిడ్జి కోర్స్​ మ్యాథ్స్​, 29న మోడర్న్​ లాంగ్వేజీ, జియోగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు.

    Latest articles

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    More like this

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...