More
    Homeభక్తిJagannath Rath Yatra | జగన్నాథ రథ యాత్ర మధ్యలో వదిలేస్తే పాపం త‌గులుతుందా?

    Jagannath Rath Yatra | జగన్నాథ రథ యాత్ర మధ్యలో వదిలేస్తే పాపం త‌గులుతుందా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jagannath Rath Yatra | హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటైన జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) ఈ ఏడాది జూన్ 27న ఘనంగా ప్రారంభమైంది. పూరి జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ వైభవమైన ఉత్సవం దేశ వ్యాప్తంగా మిలియన్ల భక్తులను ఆకర్షిస్తోంది. భగవాన్ జగన్నాథుడు, అన్న బలరాముడు(Balarama) (బలభద్ర), చెల్లెలు సుభద్రమ్మ(Subhadramma) దేవతలు ప్రత్యేకంగా అలంకరించబడిన మూడు రథాలపై గుండిచా దేవాలయం వరకు యాగ్ర‌గా వెళతారు. ఈ యాత్ర భక్తులకు ఆధ్యాత్మికంగా గొప్ప అనుభూతిని అందిస్తుంది.

    Jagannath Rath Yatra | మ‌ధ్య‌లో వ‌స్తే..

    జగన్నాథ రథయాత్ర పదిరోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు ఆలయం నుంచి గుండిచా ఆలయం(Gundicha Temple) వరకు దేవతలను తీసుకువెళతారు. అటుపై ఆ దేవాలయంలో తొమ్మిది రోజులు విశ్రాంతి తీసుకున్న అనంతరం, పదవ రోజు తిరిగి జగన్నాథ ఆలయానికి(Jagannath temple) వచ్చేస్తారు. ఈ యాత్రలో పాల్గొనడం వల్ల పాపాలు తొలగిపోతాయని, జీవితం మోక్ష మార్గంలోకి అడుగుపెడుతుందని నమ్మకం. రథాన్ని తాళ్లతో లాగడం స్వయంగా భగవంతుని సేవచేయడం లాంటిదే అనే విశ్వాసం ఉంది.

    READ ALSO  Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. జులైలో విశేష ఉత్సవాలివే..

    ఈ పదిరోజుల యాత్రలో కొంతమంది భక్తులు(Devotees) పూర్తి యాత్రను చేయలేకపోతారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మధ్యలో వెనుదిరిగేవారూ ఉంటారు. అయితే, ఇది పాపం కాదు అని పండితులు స్పష్టంగా చెబుతున్నారు. భగవాన్ జగన్నాథుడు భక్తుల మనసు తెలుసుకుంటాడు. ఏ పూజ అయినా మనస్ఫూర్తిగా, భక్తిశ్రద్ధలతో చేయడమే ముఖ్యం. మీరు హాజరైన రోజుల్లో మీరు నిజంగా భక్తితో ఉండగలిగితే, అది మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. ఇక ఇంట్లో జగన్నాథుని విగ్రహం ఉంచవచ్చా? అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. జగన్నాథుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం సాధ్యమే, కానీ కొన్ని నియమాలు పాటించాలి. విగ్రహాన్ని సాధ్యమైనంత వరకూ పూజా గదిలో ఉంచాలి. ప్రతిరోజూ విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి, చందనం, పుష్పాలతో పూజ చేయాలి. విగ్రహాన్ని ఇంట్లో ఉంచిన తర్వాత త‌గు పూజాచర్యలు కొనసాగించాలి.

    READ ALSO  Jagannath Rath Yatra | రథయాత్రలో భక్తులపైకి దూసుకెళ్లిన ఏనుగులు.. తప్పిన ప్రమాదం

    పూరిలోనే కాదు, భారతదేశంలోని అనేక ప్రధాన నగరాల్లో కూడా జగన్నాథ రథయాత్రలు ఉత్సాహంగా నిర్వహించబడుతున్నాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు Bangalore వంటి నగరాల్లోని ఇస్కాన్‌ సంస్థలు, జగన్నాథ మందిరాలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాయి. వేలాది మంది భక్తులు వీటిలో పాల్గొంటూ హరినామ సంకీర్తనలతో మునిగిపోయారు.

    Latest articles

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRAI | టెలికాం రంగంలో జియో (JIO) దూసుకుపోతుంది. మే నెలలో రికార్డు స్థాయిలో...

    High Court | ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. రూ.350 కోట్ల భూ కేటాయింపులు రద్దు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: High Court | రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ (Hyderabad)​లో అంతర్జాతీయ...

    More like this

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    Electricity Employees JAC | ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్​ జేఏసీ ఆధ్వర్యంలో అధికారులకు సన్మానం

    అక్షరటుడే, ఇందూరు: Electricity Employees JAC | తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్​గా వ్యవహరించి ఉద్యమాన్ని...

    TRAI | జియోకు భారీగా పెరిగిన యూజర్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : TRAI | టెలికాం రంగంలో జియో (JIO) దూసుకుపోతుంది. మే నెలలో రికార్డు స్థాయిలో...