ePaper
More
    Homeఅంతర్జాతీయంB-2 Bombers | ఆ విమానాలు ఏమయ్యాయి..? ఇరాన్​పై దాడి తర్వాత తిరిగి రాని...

    B-2 Bombers | ఆ విమానాలు ఏమయ్యాయి..? ఇరాన్​పై దాడి తర్వాత తిరిగి రాని బీ-2 విమానాల బృందం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: B-2 Bombers | ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దళం చేపట్టిన బాంబు దాడి ఊహించని మలుపు తిరిగింది. ఇందులో పాల్గొన్న B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లలో (B-2 Spirit Stealth Bombers) ఒక బృందం స్థావరానికి తిరిగి రాలేదు. దాని ఆచూకీ తెలియక పోవడంతో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. ఇరాన్​పై దాడికి జూన్ 21న మిస్సోరీ(Missouri)లోని వైట్మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి అమెరికా రెండు వేర్వేరు B-2 బాంబర్ల బృందాలను మోహరించింది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను తప్పుదారి పట్టించేందుకు ఒక బృందం పసిఫిక్ మీదుగా పశ్చిమ దిశగా ప్రయాణించింది. ఏడు B-2లతో కూడిన రెండవ బృందం టెహ్రాన్​లోని ఫోర్డో(Tehran Fordow), నటాంజ్​లోని భూగర్భ అణు కేంద్రాలపై దాడి చేయడానికి తూర్పు వైపునకు వెళ్లింది. సదరు స్ట్రైక్ బృందం తన మిషన్​ను పూర్తి చేసి, 37 గంటల నిరంతర ప్రయాణం తర్వాత స్థావరానికి తిరిగి వచ్చింది. కానీ పసిఫిక్ వైపు ప్రయాణించిన డెకాయ్ బృందం జాడ తెలియకుండా పోయింది.

    READ ALSO  Food Delivery Agent | ప్రఖ్యాత యూనివర్సిటీల్లో డిగ్రీలు, పీహెచ్‌డీలు.. ఉద్యోగం దొర‌క్క డెలివ‌రీ బాయ్‌గా..

    B-2 Bombers | హవాయిలో కనిపించిన బీ-2

    బీ-2 బాంబర్ల బృందం కనిపించకుండా పోయిన ఉదంతంపై అమెరికా(America) నుంచి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఆ బృందంలోని ఓ విమానం ఆచూకీ తాజాగా లభ్యం కావడం చర్చనీయాంశమైంది. పశ్చిమ వైపు ప్రయాణించిన బీ-2 విమానాల బృందంలోని ఓ విమానం హవాయిలో అత్యవసరంగా ల్యాండింగ్ అయిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోనోలులులోని హికామ్ ఎయిర్ ఫోర్స్ బేస్తో రన్వేలను పంచుకునే డేనియల్ కె.ఇనోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టెల్త్ బాంబర్ దిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టు(Airport)లో పార్కింగ్ చేసిన ఉన్న బీ-2 బాంబర్ వీడియో ఆన్​లైన్​లో వైరల్ అయింది. అయితే, అమెరికా వెళ్లాల్సిన ఈ విమానం ఎందుకు ఇక్కడ ల్యాండ్ అయిందన్న దానికి గల కారణాలు తెలియరాలేదు. ఏదైనా ఎమర్జెన్సీ తలెత్తడంతో ఇక్కడ అత్యవసరంగా ల్యాండ్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

    READ ALSO  Tesla | ఎలన్​ మస్క్ కొత్త పార్టీ ఎఫెక్ట్.. భారీగా పతనమైన టెస్లా షేర్లు.. ఒకే రోజు ఎంత పడిపోయాయంటే..

    అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన బీ-2 బాంబర్ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఏప్రిల్ 2023లో కూడా హవాయిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్​ (Emergency Landing) అయింది. 2022లో మిస్సౌరీలో జరిగిన ప్రమాదం తర్వాత మొత్తం B-2 విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. 2008లో ఓ బీ-2 బాంబర్ తీవ్ర ప్రమాదానికి గురైంది. గ్వామ్ లోని అండర్సన్ వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే “స్పిరిట్ ఆఫ్ కాన్సాస్”(Spirit of Kansas) కూలిపోయింది. అయితే ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటకు వచ్చారు.

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....