ePaper
More
    HomeజాతీయంAhmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే..?

    Ahmedabad Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. అహ్మదాబాద్​ నుంచి లండన్​ వెళ్తున్న ఎయిర్​ ఇండియా విమానం(Air India plane) జూన్​ 12న కూలిపోయిన విషయం తెలిసిందే.

    ఈ ఘటనలో విమానంలోని 241 మంది మృతి చెందారు. అంతేగాకుండా విమానం బీజే మెడికల్​ కాలేజీ భవనం(BJ Medical College Building)పై పడటంతో అందులోని వైద్య విద్యార్థులు కూడా చనిపోయారు. మొత్తం 270 మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు. అయితే విమాన ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే దానిపై తాజాగా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక అందించింది.

    Ahmedabad Plane Crash | ఆ స్వీచ్​లు ఆగిపోవడంతో..

    అహ్మదాబాద్​ విమాన ప్రమాదం జరగడంతో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (Aircraft Accident Investigation Bureau) విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. విమాన ఇంజిన్ల ఇంధన కంట్రోల్ స్విచ్​లు ఆగిపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా బ్యూరో నిర్ధారించింది.

    READ ALSO  BSE Office | బీఎస్ఈ కార్యాల‌యానికి బాంబు బెదిరింపు.. త‌నిఖీలు చేపట్టిన పోలీసులు

    ప్రమాదానికి ముందు కాక్‌పిట్‌లో ఏ జరిగిందన్న వివరాలను నివేదికలో AAIB వెల్లడించింది. విమానం గరిష్ఠ వేగమైన 180 నాట్స్‌ను అందుకున్న మరుక్షణమే ‘రన్’ నుంచి ‘కటాఫ్’ పొజిషన్‌కు ఇంజిన్–1, ఇంజిన్ –2కు చెందిన ఇంధన స్విచ్​లు మారాయని తెలిపింది. ఇంధన సరఫరా నిలిచిపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు పేర్కొంది.

    ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోవడంతో ఇంజిన్లు రెండూ టేకాఫ్ వేగం నుంచి తగ్గుతూ వచ్చాయి. దీంతో స్విచ్​లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్‌ను ప్రశ్నించగా తాను చేయలేదని ఆయన తెలిపారు. ఈ మేరకు బ్లాక్​ బాక్స్ ​(Black Box)లో రికార్డు అయింది. దీంతో ఎయిర్‌పోర్టు పెరీమీటర్ గోడను దాటిన వెంటనే ఎత్తు తగ్గుతూ వచ్చి కూలిపోయింది.

    Ahmedabad Plane Crash | మేడే సందేశం..

    మొదటి ఇంజిన్, రెండో ఇంజిన్ ఇంధన స్విచ్ ‘కటాఫ్’ నుంచి మళ్లీ ‘రన్’కు మారినా.. రెండో ఇంజిన్ మాత్రం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయింది. దీంతో మధ్యాహ్నం 1:39 గంటలకు పైలెట్​ మేడే కాల్ (Pilot Mayday Call) ఇచ్చారు. అనంతరం వెంటనే విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది మృతి చెందారు. అందులో గుజరాత్​ మాజీ ముఖ్యమంత్రి విజయ్​ రూపాని కూడా ఉన్నారు.

    READ ALSO  Maoists Surrendered | మావోయిస్టులకు మరో షాక్​.. లొంగిపోయిన 22 మంది

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    Latest articles

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...

    CP Sai Chaitanya | వేల్పూరు మండలంలో 163 యాక్ట్​ అమలు.. నలుగురు గుమిగూడితే చర్యలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో...

    More like this

    Koppula Eshwar | కవితకు షాక్​.. బొగ్గు గని కార్మిక సంఘం నుంచి దూరం పెట్టిన కేటీఆర్​.. కొప్పులకు ఇంఛార్జి బాధ్యతలు

    అక్షరటుడే, హైదరాబాద్: Koppula Eshwar | మాజీ మంత్రి, భారాస వర్కింగ్​ ప్రెసిడెంట్​, ఎమ్మెల్యే కేటీఆర్(KTR), ఎమ్మెల్సీ...

    Israel bombed Syria | సిరియా ఆర్మీ హెడ్​క్వార్టర్​ను పేల్చేసిన ఇజ్రాయెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel bombed Syria : సిరియా రాజధాని డమాస్కస్​(Damascus)పై ఇజ్రాయెల్​ Israel విరుచుకుపడింది. ఈ సిటీలోని...

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక...