అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలో చెత్త సేకరణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది నిజాయితీ చాటారు. ఓ మహిళకు చెందిన బంగారు గొలుసును భద్రంగా ఆమె చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని జోన్–2 పరిధిలోని 24వ డివిజన్లో ఉదయం చెత్త సేకరణలో నిమగ్నమైన ట్రాక్టర్ డ్రైవర్ ఇమామ్, జవాన్ కుమార్లకు రెండు తులాల బంగారు గొలుసు దొరికింది.
అనంతరం కొద్దిసేపటికి గాయత్రినగర్కు (Gayatri nagar) చెందిన పద్మాగౌడ్ అనే మహిళ గొలుసు పోయిందని మున్సిపల్ సిబ్బందిని సంప్రదించింది. దీంతో విచారణ అనంతరం ఆమెకు వారు బంగారు గొలుసును అందజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది ఇమామ్, జవాన్ కుమార్ను కార్పొరేషన్ కమిషనర్ దిలీప్కుమార్ ఘనంగా సన్మానించారు. ప్రజలు చెత్తవేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. తమ సిబ్బంది నిజాయితీ నిబద్దతతో పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.

పోగొట్టుకున్న గొలుసును మహిళ పద్మాగౌడ్కు అందజేస్తున్న మున్సిపల్ సిబ్బంది