అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh Reddy | రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. మాక్లూర్ (makloor mandal) మండలంలోని మామిడిపల్లిలో (mamidipally village) మండల అధ్యక్షురాలు మమత రాజేశ్వర్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘మా కే నాంపే ఏక్ పేడ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బూటకపు హామీలను ఎండగడతామన్నారు. రాబోయే 25 రోజులు బీజేపీ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్, జిల్లా కో కన్వీనర్ గంగోనే సంతోష్, కొత్తూరు గంగాధర్, శివలాల్, బొబ్బిలి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.