అక్షరటుడే, ఇందూరు: Drug Awareness Rally | డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ (Borgam(P) ZPHS) హెచ్ఎం శంకర్ అన్నారు. గురువారం పాఠశాలలో ఆధ్వర్యంలో డ్రగ్ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లాస్థాయిలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం జిల్లా జడ్జి భరతలక్ష్మి (District Judge Bharathalakshmi) చేతుల మీదుగా పాఠశాలకు చెందిన విద్యార్థిని సుమిష ప్రశంసాపత్రం అందుకున్నారు. ర్యాలీలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వ్యాసరచన పోటీలో జిల్లా జడ్జి భరతలక్ష్మి నుంచి ప్రశంసాపత్రం అందుకున్న జడ్పీహెచ్ఎస్ బోర్గాం(పి) విద్యార్థిని సుమిష
Drug Awareness Rally | విశ్వోదయ పాఠశాలలో..
నగరంలోని ఉషోదయ హైస్కూల్లో (Ushodaya High School) గురువారం యాంటీ డ్రగ్ డే (Anti-Drug Day) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రయోజనాలపై వివరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న విశ్వోదయ హైస్కూల్ విద్యార్థులు