అక్షరటుడే, డిచ్పల్లి: Rural MLA Bhupathi reddy | మాజీ ప్రధాని రాజీవ్గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi reddy) అన్నారు. బుధవారం రాజీవ్గాంధీ వర్ధంతి (Rajiv Gandhi’s death anniversary) సందర్భంగా నగరంలోని హనుమాన్ జంక్షన్ (Hanuman Junction) వద్ద రాజీవ్గాంధీ విగ్రహాం వద్ద నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అనేక పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డిచ్పల్లి మండలాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, నిజామాబాద్ రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్, కాంగ్రెస్ నాయకులు వాసు బాబు, ధర్మాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.