అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ operation sindoor అనంతరం జరిగిన పరిణామాలతో భారత్ పాక్పై దాడులు చేసిందని డీజీఎంవోలు DGMO తెలిపారు. ఈ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన పాక్.. తనకు జరిగిన డ్యామేజీ గురించి చెప్పుకోవడం లేదన్నారు. డీజీఎంవో రాజీవ్ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, నేవీ చీఫ్ ప్రమోద్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులు, వారికి సాయం చేసే వారే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టామని తెలిపారు. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. కానీ పాకిస్తాన్ pakistan తమపై దాడి చేస్తుందని అనుకుంటోందన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ అండగా నిలిచిందని పేర్కొన్నారు.
Operation Sindoor | ఆట కట్టించిన ‘ఆకాశ్’
ఉగ్రవాదులపై భారత్ దాడులకు ప్రతీకారంగా పాక్ వివిధ రకాల డ్రోన్లను ప్రయోగించిందన్నారు. వివిధ రకాల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో air defence systems పాకిస్తాన్ను అడ్డుకున్నామని చెప్పారు. ముఖ్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ క్షిపణులతో akash missile విజయవంతంగా శత్రువును అడ్డుకున్నట్లు తెలిపారు. చైనా తయారు చేసిన పీ–15 మిస్సైళ్లతో పాక్ దాడి చేసిందన్నారు. వాటిని ఆకాశ్ క్షిపణులతో నిర్వీర్యం చేశామని చెప్పారు. టర్కీ డ్రోన్లను దాయాది దేశం ఉపయోగించిందన్నారు. భారత్ను ఏ దేశ ఆయుధాలు ఏమీ చేయలేవన్నారు.
Operation Sindoor | సర్వ సన్నద్ధంగా సైన్యం
ప్రస్తుత పరిస్థితుల్లో భారత దళాలు ఎలాంటి ఆపరేషన్లకైనా సర్వసన్నద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు. దేశ ప్రజలంతా తమకు అండగా నిలిచారన్నారు. పాకిస్తాన్ నూర్ఖాన్ ఎయిర్బేస్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడిలో తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. ఎయిర్బేస్ రన్వే తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. 9, 10 తేదీల్లో పాకిస్తాన్ మన వైమానిక స్థావరాలే టార్గెట్గా దాడులు చేసేందుకు యత్నించిందన్నారు. మల్టీ లెవల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం పాక్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుందన్నారు.
Operation Sindoor | అణుస్థావరాలపై దాడులు చేయలేదు
ఉగ్రవాదులు కొన్నేళ్లుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారని అధికారులు తెలిపారు. సైనికులనే కాకుండా, యాత్రికులను, భక్తులను కూడా టార్గెట్ చేసుకుంటున్నారని వివరించారు. ఉగ్రవాదులను అంతం చేయడమే భారత్ లక్ష్యమన్నారు. పాకిస్తాన్లోని అణుస్థావరాలే లక్ష్యంగా తాము దాడులు చేయలేదని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. పాక్లోని కిరాణ హిల్ష్పై దాడి చేయలేదన్నారు. అక్కడ ఏముందో తమకు తెలియని చెప్పారు. అయితే పాక్లోని రక్షణ వ్యవస్థలను నాశనం చేశామని ఆయన వివరించారు.