అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని కేంద్రం తెలిపింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ vikram misri, కల్నల్ సోఫియా ఖురేషీ sofia khureshi, ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండ్ వ్యోమికాసింగ్ vyomika singh శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.
నిన్న రాత్రి పలు నగరాలు, ఎయిర్పోర్టులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులకు పాల్పడిందన్నారు. భారత గగనతలంలోకి డ్రోన్లు, విమానాలు వచ్చాయన్నారు. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను paistan drones సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొన్నారు. నాలుగు ఎయిర్పోర్టులు లక్ష్యంగా పాక్ దాడులకు దిగిందని చెప్పారు. 300 – 400 డ్రోన్లతో దాడికి యత్నించిందని తెలిపారు. 36 చోట్ల దాడులకు యత్నించిందని పేర్కొన్నారు. వీటిని భారత్ సమర్థవంతంగా కూల్చివేసిందని చెప్పారు. డ్రోన్లు టర్కీకి turky drones చెందినవిగా ప్రాథమికంగా గుర్తించామన్నారు.
Operation Sindoor | భారత్ సంయమనం..
ప్రతిదాడుల విషయంలో భారత్ సంయమనం పాటించిందని పేర్కొన్నారు. భటిండా, ఉదంపూర్ ఎయిర్ పోర్టులు లక్ష్యంగా పాక్ దాడులకు ప్రయత్నం చేసిందని చెప్పారు. భారత్ ఎదురుదాడిలో పాక్ భారీగా నష్టపోయిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత్ సంయమనం పాటించిందన్నారు. పౌర విమానాలను రక్షణగా చేసుకుని పాక్ దాడులు చేస్తోందన్నారు.
Operation Sindoor | గురుద్వారాలు, ఆలయాలే లక్ష్యంగా..
ఎల్వోసీ వెంబడి పాక్ నిరంతరాయంగా కాల్పులు జరుపుతోందని చెప్పారు. సరిహద్దులో భారీ ఆర్టిలరీలతో కాల్పులకు జరుపుతోందని వివరించారు. మన గురుద్వారాలు, ఆలయాలపై దాడులు చేసి దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని భావించిందని చెప్పారు. కర్తార్పూర్ కారిడార్ను మూసివేశామని చెప్పారు.