ePaper
More
    HomeజాతీయంOperation Sindoor | ఒకేసారి మూడు దేశాలను ఓడించాం.. భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ కీలక...

    Operation Sindoor | ఒకేసారి మూడు దేశాలను ఓడించాం.. భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindoor | భారత డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ రాహుల్‌ ఆర్‌సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆపరేషన్​ సిందూర్​ సమయంలో భారత్​ ఒకేసారి మూడు దేశాలతో యుద్ధం చేసిందని ఆయన పేర్కొన్నారు. మూడు దేశాలను యుద్ధ రంగంలో ఓడించామని ఆయన తెలిపారు. ఫిక్కి నిర్వహించిన న్యూ ఏజ్ మిలిటరీ టెక్నాలజీస్ (New Age Military Technologies) కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

    జమ్మూ కశ్మీర్​లోని పహల్గామ్​లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూరు(Operation Sindoor) చేపట్టి పాక్​, పీవోకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. భారత్​ దెబ్బతో షాకైన పాక్​ తర్వాత డ్రోన్లు, క్షిపణులతో భారత్​పై దాడులు చేసింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ పాక్​ దాడులను అడ్డుకుంది.

    READ ALSO  Pet Rules | కుక్కను పెంచుకోవాలనుకుంటున్నారా.. ప‌ది మంది అనుమ‌తి తప్ప‌నిస‌రి.. ఎక్కడో తెలుసా..!

    Operation Sindoor | ఆ దేశాలను ఓడించాం

    ఆపరేషన్​ సిందూర్​ సమయంలో పాకిస్తాన్​(Pakistan)కు తుర్కీయే డ్రోన్లను సరఫరా చేసింది. చైనా కూడా ఆయుధాలు అందించినట్లు సమాచారం. పాక్​ పలు చైనా క్షిపణులను ప్రయోగించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో తాజాగా రాహుల్‌ ఆర్‌సింగ్‌(Rahul R Singh) మాట్లాడుతూ.. పాక్‌తో పాటు చైనా, తుర్కియేను ఓడించామన్నారు.
    చైనా పాకిస్తాన్‌ను లైవ్‌ ల్యాబ్‌లా వాడుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్​ ప్రయోగించిన పలు చైనా మిసైళ్లు(Chinese Missiles) పని లక్ష్యాన్ని చేరుకోకముందే కూలిపోయాయి. అలాగే చైనా నుంచి పాక్​ కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థ భారత దాడులను అడ్డుకోలేకపోయింది. అదే సమయంలో భారత్​ రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్​–400 సిస్టమ్​ సమర్థవంతంగా పని చేసింది. ఈ క్రమంలో డిప్యూటీ ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలు చేశారు. తుర్కియే పైలట్లు నేరుగా యుద్ధంలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే చైనా పాకిస్తాన్‌కు ప్రత్యక్ష కార్యాచరణ డేటాను అందించిందని, భారత్​పై నిఘా ఉంచిందని ఆయన తెలిపారు.

    READ ALSO  Social Accounts ban | పాక్ న‌టుల సోష‌ల్ అకౌంట్ల‌పై మ‌ళ్లీ నిషేధం

    Latest articles

    ACB Trap | ఏసీబీకి చిక్కిన ట్యాక్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు తీసుకోనిదే...

    Deputy CM Bhatti | నీళ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? బీఆర్ఎస్‌కు డిప్యూటీ సీఎం భట్టి సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Deputy CM Bhatti | కృష్ణ, గోదావరి నీళ్లపై శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా...

    Kamareddy Degree College | విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు ఎదగాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Degree College | కామారెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని...

    NH 44 | హైవేపై రోడ్డు ప్రమాదం.. మూడు కార్లను ఢీకొట్టిన లారీ..

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై 44పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి పోలీస్...

    More like this

    ACB Trap | ఏసీబీకి చిక్కిన ట్యాక్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు తీసుకోనిదే...

    Deputy CM Bhatti | నీళ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? బీఆర్ఎస్‌కు డిప్యూటీ సీఎం భట్టి సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Deputy CM Bhatti | కృష్ణ, గోదావరి నీళ్లపై శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా...

    Kamareddy Degree College | విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతస్థానాలకు ఎదగాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Degree College | కామారెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని...