అక్షరటుడే, కామారెడ్డి:Shabbir Ali | జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి(terrorist attack)ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) అన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఉగ్రదాడి అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
ఈ దాడిలో చాలా మంది పర్యాటకులు(Tourists) చనిపోయారని, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం(Government) ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్య అయినా సరే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.