అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఔరంగజేబ్ అహ్మద్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. తాము ఉగ్రవాదులకు మద్దతుగా ఉన్నామని బాహటంగానే చేప్పేశారు. పుల్వామా ఉగ్రదాడిలో pulwama terror attack పాక్ సైన్యం పాత్ర ఉందని ఒప్పుకున్నాడు. అంతేగాకుండా ఈ దాడిని పాక్ వ్యూహాత్మక ప్రతిభగా చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఔరంగజేబ్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు సాయం చేస్తోందని అంగీకరించాడు.
పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాక్ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ పుల్వామా దాడిలో తమ పాత్ర ఉందని అంగీకరించాడు. ‘‘పుల్వామాలో మా అద్భుతమైన ప్రతిభను చూపించాం. మా ఎత్తుగడలు ఏంటో నిరూపించుకున్నాం. కార్యదక్షత.. వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించాం’’ అని వ్యాఖ్యానించారు.
Operation Sindoor | 40 మంది సైనికులు మృతి
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న ఆర్మీ జవాన్ల కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేశారు. జైషే మహమ్మద్ సంస్థకు చెందిన సూసైడ్ బాంబర్ దాడి చేయడంతో 40 మంది సైనికులు మృతి చెందారు. అప్పుడు ఈ ఘటనతో తమకు సంబంధం లేదని బుకాయించిన పాక్.. తాజాగా తామే దాడి చేశామని చెప్పుకోవడం గమనార్హం.
Operation Sindoor | వైమానిక దాడులతో ప్రతీకారం
పుల్వామా ఉగ్రదాడికి భారత్ వైమానిక దాడులతో బదులు చెప్పింది. 2019 ఫిబ్రవరి 25న భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లో గల ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 300 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు. అయినా బుద్ధి మార్చుకోని పాకిస్తాన్ తాజాగా మళ్లీ పహల్గామ్లో ఉగ్రదాడి చేయించింది.