అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: PCC Chief | రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను పక్కగా అమలు చేస్తున్నామని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief Bomma Mahesh Kumar Goud) అన్నారు. నగరంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో (Rajiv Gandhi Auditorium) ఆదివారం షాదీ ముబారక్ (Shadi Mubarak), కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi) చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు నిరాటంకంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (Mla Dhanpal), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali), రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, నుడా ఛైర్మన్ కేశవేణు (Nuda Chairman Keshavenu), ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ (State Cooperative Union Limited), సీనియర్ నాయకులు నరాల రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.