అక్షరటుడే, నిజాంసాగర్: Minister Komatireddy | రాష్ట్రంలో రోడ్ల నిర్మాణాలకు అధికమొత్తంలో నిధులిస్తున్నామని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) అన్నారు. పిట్లం(Pitlam) మండలం మద్దెల చెరువు రోడ్డు, తిమ్మానగర్ వద్ద ఎఫ్డీఆర్ నిధులు (FDR Funds) రూ. 4.86 కోట్లతో నిర్మించిన హైలెవెల్ వంతెనను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రామీణ రోడ్లను మెరుగుపర్చాలనే కృతనిశ్చయంతో రేవంత్రెడ్డి (CM Revanth reddy) సర్కారు ముందుకు వెళ్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్ షెట్కార్(MP Suresh Shetkar), ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు(MLA Thota Lakshmi Kantha Rao), నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి (MLA Sanjeeva Reddy), కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan), బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmayi) తదితరులు పాల్గొన్నారు.
Minister Komatireddy | మంత్రికి స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు..
జిల్లాకు వచ్చిన రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మండలంలోని నర్సింగ్రావు పల్లి చౌరస్తా వద్ద ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్తో పాటు జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
Minister Komatireddy | మంత్రి పర్యటన షెడ్యూల్ ఇదే..
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మధ్యాహ్నం డోంగ్లీలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బిచ్కుందలో (Binchkunda) పబ్లిక్ మీటింగ్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఇటీవల అకాలమరణం చెందిన సీనియర్ జర్నలిస్ట్ దత్తురెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

మంత్రికి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ శ్రేణులు
Minister Komatireddy | డోంగ్లీ రోడ్డుకు శంకుస్థాపన..

అక్షరటుడే, బిచ్కుంద: బిచ్కుంద నుంచి డోంగ్లి వరకు రూ.13.20 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే రోడ్డు పనులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేశ్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
Minister Komatireddy | పంచాయతీ రోడ్లను రోడ్ల భవనాల శాఖ పరిధిలోకి తేవాలి..

అక్షరటుడే, నిజాంసాగర్: నిజాంసాగర్ మండలంలోని పలు పంచాయతీరాజ్ రోడ్లను, రోడ్లు భవనాల శాఖ పరిధిలోకి తీసుకురావాలని పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చోకోటి మనోజ్కుమార్ పేర్కొన్నారు. జిల్లాకు విచ్చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని మనోజ్కుమార్తో పాటు, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ఎన్నారై భాస్కర్రెడ్డి, పిట్లం మండల సీనియర్ నాయకులు అడ్వకేట్ రాంరెడ్డి సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కరీంనగర్ నుండి సిరిసిల్ల మీదుగా పిట్లం వరకు నాలుగు లైన్ల రహదారి మంజూరయ్యేలా చూడాలని కోరారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు త్వరగా ప్రారంభించేలా చొరవ చూపాలంటూ వారు మంత్రికి విన్నవించారు.