అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | మొబైళ్లను రికవరీ చేయడంలో కమిషనరేట్లను మినహాయిస్తే జిల్లాల్లో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. పోలీస్ కార్యాలయంలో బుధవారం రూ.16 లక్షలు విలువు చేసే 110 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఎస్పీ అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొబైల్ పోయినా, చోరీకి గురైనా వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని.. సిమ్ కార్డ్ (Mobile Sim Card) బ్లాక్ చేసి అదే నంబర్పై కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోగొట్టుకున్న సెల్ఫోన్ల కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి, ఒక ఆర్ఎస్ఐ, 10 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. 10 రోజుల్లో టీం అధికారులు 110 ఫోన్లను రికవరీ చేశారన్నారు. ఈ సందర్భంగా టీం సభ్యులను ఎస్పీ అభినందించారు.