అక్షరటుడే, వెబ్డెస్క్: Stock Market | ఇరాన్ – ఇజ్రాయెల్ సీజ్ఫైర్కు అంగీకరించాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) ప్రకటనతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లు(Global stock markets) పరుగులు తీస్తున్నాయి. మన మార్కెట్లు కూడా ర్యాలీ తీస్తున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 638 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 208 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కాస్త ఒడిదుడుకులకు లోనైనా పైపైకి వెళ్లాయి. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 990 పాయింట్ల లాభంతో 82,887 వద్ద, నిఫ్టీ(Nifty) 299 పాయింట్ల లాభంతో 25,271 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | మార్కెట్లలో ర్యాలీకి కారణాలు..
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య సీజ్ఫైర్(Cease fire) పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన చేయడంతో మార్కెట్లలో జోష్ వచ్చింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గుతుండడం, ముడి చమురు ధర అదుపులోకి రావడం వంటి కారణాలతో అంతర్జాతీయంగా అన్ని ప్రధాన మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి.
ముడి చమురు ధర తగ్గడం, రూపాయి విలువ బలపడడం, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు(Global rating agencies) భారతదేశ జీడీపీ వృద్ధిని సవరించి 6.5 శాతానికి పెంచడం మన మార్కెట్లకు మరింత బూస్ట్ ఇచ్చింది. అన్ని రంగాల షేర్లు లాభాలబాటలో ఉన్నాయి. మంగళవారం మార్కెట్ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే బీఎస్ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ క్యాపిటల్ రూ.4 లక్షల కోట్లు పెరగడం గమనార్హం.
Stock Market | అన్ని రంగాల్లో దూకుడు
అన్ని రంగాల షేర్లు పరుగులు తీస్తున్నాయి. బీఎస్ఈ(BSE)లో అత్యధికంగా పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 2.36 శాతం పెరిగింది. మెటల్ 1.95 శాతం, టెలికాం(Telecom) 1.86, ఆటో సూచీ 1.54 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.40 శాతం, బ్యాంకెక్స్ 1.35 శాతం, ఇన్ఫ్రా 1.19 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్ 1.16 శాతం, రియాలిటీ ఇండెక్స్ 1.08 శాతం లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.27 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.05 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.88 శాతం లాభంతో ఉన్నాయి.
Top gainers:బీఎస్ఈలో 27 కంపెనీలు లాభాలతో, 3 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. అదానిపోర్ట్స్(Adani ports) 3.68 శాతం, అల్ట్రాటెస్ సిమెంట్ 2.90 శాతం, టీసీఎస్ 2.79 శాతం, ఎంఅండ్ఎం 2.42 శాతం, ఎల్టీ 2.38 శాతం లాభాలతో ఉన్నాయి.
Losers:ఎన్టీపీసీ 0.85 శాతం, బీఈఎల్ 0.75 శాతం, ట్రెంట్ 0.09 శాతం నష్టాలతో ఉన్నాయి.