అక్షరటుడే, బాన్సువాడ: Vivek Venkataswamy | చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి (Gaddam Vivek Venkataswamy)రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడంపై పట్టణంలో మాల సంఘం సభ్యులు ఆదివారం సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు అంబేద్కర్ చౌరస్తాలో టపాసులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు.
అనంతరం మాల సంఘం(తెలంగాణ) (Maala Sangham) వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యల సంతోష్ మాట్లాడుతూ.. వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇవ్వడంపై సీఎం రేవంత్ (CM Revanth Reddy), టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్కు (TPCC Chief Mahesh Kumar Goud) కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందర్నీ ఏకతాటిపైకి తేవడంలో వివేక్ వెంకట స్వామి కీలకపాత్ర పోషించారని, ఆయనకు మంత్రి పదవి దక్కడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు గైని ప్రవీణ్ కుమార్, డివిజన్ నాయకులు ఆంజనేయులు, సురేష్, గంగారాం, సుధాకర్, అశోక్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.