అక్షరటుడే, హైదరాబాద్: Minister Vivek | రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనుల – భూగర్భ శాఖ మంత్రిగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. నేడు (జూన్ 18న) సెక్రటేరియట్ రెండో అంతస్తులో తనకు కేటాయించిన ఛాంబర్లో మంత్రిగా ఛార్జ్(Ministerial charge) తీసుకున్నారు.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివేక్.. ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు(Advance Technology Centers)గా మార్చే ఫైల్ మీద తొలి సంతకం చేశారు. మొత్తం 46 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసే రూ.2600 కోట్ల నిధుల దస్త్రంపై సంతకం చేశారు.
అంతకుముందు మంత్రిగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా తన ఛాంబర్లో మంత్రి వివేక్(Minister Vivek) ప్రత్యేక పూజలు చేశారు. సతీమణి సరోజతో కలిసి పూజాల్లో పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ కోసం సచివాలయానికి వెళ్లిన మంత్రి వివేక్కు ఆయన ఛాంబర్ ఎదుట పూజారులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి వివేక్ బాధ్యతల స్వీకరణ వేడుకలో ఆయన కుమారుడు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వివేక్కు సహచర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswara Rao) శుభాకాంక్షలు తెలిపారు. వివేక్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఆయనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు.