అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion : నిజామాబాద్ జిల్లా కేంద్రం(Nizamabad district headquarters)లోని శ్రీ విశ్వశాంతి హై స్కూల్(Shri Vishwashanti High School) 2004-05 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. నగరంలోని వంశీ హోటల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చిన్ననాటి జ్ఞాపకాల(childhood memories)ను నెమరు వేసుకున్నారు. తమ అనుభవాలను పంచుకున్నారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. నాటి గురువులను సన్మానించారు.
