అక్షరటుడే, వెబ్డెస్క్ : Abu Dhabi | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ప్రజలకు ఇండిగో(Indigo) విమాన సంస్థ గుడ్న్యూస్ చెప్పింది.
విశాఖపట్నం నుంచి యూఏఈ రాజధాని అబుదాబికి (Vizag – Abu Dhabi) నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించింది. ఈ ఫ్లైట్ విశాఖపట్నం, ఒడిశాలోని భువనేశ్వర్ మీదుగా అబుదాబి వెళ్లనుంది. ఫలితంగా దుబాయ్ వెళ్లే వారికి మంచి వెసులుబాటు కలగనుంది. ఉద్యోగ, ఉపాధి, వ్యాపారాల నిమిత్తం వైజాగ్ సహా చుట్టు పక్కల జిల్లాల నుంచి వేలాది మంది యూఏఈకి వెళ్తుంటారు. అలాంటి వారందరికీ ఇది శుభవార్తే.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు లేవు. దీంతో అబుదాబి వెళ్లాల్సిన ఏపీ వాసులు హైదరాబాద్ (Hyderabad), బెంగళూరు (Bangaluru), చెన్నై మీదుగా వెళ్తున్నారు. తాజాగా ఇండిగో విమాన సంస్థ అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను ప్రారంభించింది. జూన్ 13 నుంచి విమానాలు నడవనున్నాయి. సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.