అక్షరటుడే, వెబ్డెస్క్: Virat Kohli | హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohith Sharma) కొద్ది రోజుల క్రితం టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్(Virat Kohli Retirement) గురించి చర్చలు నడిచాయి. ఇంగ్లాండ్తో భారతదేశం రాబోయే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం వారు ఒక జట్టును ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నందున సెలెక్టర్ల కోసం సమయం ముగిసింది. జూన్లో ప్రారంభమయ్యే ఈ సిరీస్ ఇప్పటికే ఇండియా కెప్టెన్గా ఎవరిని ఎంపిక చేయాలనే చర్చలు నడిచాయి. విరాట్ కోహ్లీ(Virat Kohli)ని టెస్ట్ కెప్టెన్గా చేయబోతున్నారనే చర్చ కూడా నడిచింది. రోహిత్ శర్మ దూరమైన నేపథ్యంలో కోహ్లీ కూడా ఆడకపోతే ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ అనుభవలేమి జట్టును దెబ్బతీస్తుందని భావించిన బీసీసీఐ అతడిని వారిస్తున్నట్లుగా వార్తలొచ్చాయి.
Virat Kohli | పెద్ద షాకే..
ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్కు విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ను ప్రకటించారు. 14 సంవత్సరాల పాటు భారత్ తరఫున టెస్టు క్రికెట్(Test Cricket)కు ప్రాతినిధ్యం వహించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. కెరీర్లో 123 టెస్టు మ్యాచ్లను ఆడిన కోహ్లీ, 9,230 పరుగులు సాధించారు. గత కొన్ని రోజులగా అతడి టెస్టు రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలు నిజమయ్యాయి. సోమవారం సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ కోహ్లీ ప్రకటించాడు. రోహిత్ శర్మ Rohit Sharma టెస్టుల నుంచి తప్పుకున్న వారం రోజుల లోపే కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలకడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)ఉన్నాడు. ఇంగ్లీష్ గడ్డపై సచిన్ 30 ఇన్నింగ్స్ల్లో 54 సగటుతో 1575 పరుగులు చేశాడు. ఇక విరాట్ విషయానికి వస్తే.. కోహ్లీ 17 టెస్టుల్లో 33 సగటుతో 1096 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ వెళ్తే 5 టెస్టుల్లో సచిన్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. కాని అరుదైన రికార్డ్ ని కోహ్లీ మిస్ చేసుకున్నాడు.