అక్షరటుడే, వెబ్డెస్క్: Bheemgal | భీమ్గల్ ఎస్సై, కానిస్టేబుళ్లు తనను కొట్టారని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రం కేంద్రంలోని సీపీ క్యాంపు కార్యాలయం (nizamabad Cp Camp office) ఎదుట ఓ వ్యక్తి ఆదివారం ఆందోళనకు దిగాడు.
బాధితుడు గుగ్లోత్ బీను తెలిపిన వివరాల ప్రకారం.. భీమ్గల్ మండలం రూప్ల తండాకు చెందిన బీను, అతని కొడుకు మధ్య ఇల్లు నిర్మాణం విషయంలో శనివారం గొడవ జరిగింది. దీంతో కొడుకు తన తండ్రిపై ఫిర్యాదు చేసేందుకు భీమ్గల్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అనంతరం కొద్దిసేపటికి తండ్రి సైతం స్టేషన్కు వచ్చాడు. ఈ క్రమంలో బీనును ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు లాఠీలతో తీవ్రంగా కొట్టారు. కాసేపటి తర్వాత వదిలేయడంతో బాధితుడు ఆర్మూర్కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు.
ఆదివారం నిజామాబాద్ సీపీ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపాడు. అనంతరం స్పెషల్ బ్రాంచి సీఐ శ్రీశైలం అక్కడికి చేరుకుని బాధితుడితో మాట్లాడాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు వేడుకున్నాడు. ఆ తర్వాత బాధితుడు చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం.