అక్షరటుడే, డిచ్పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్లైన్లో దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ (DOST Registrations) చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థుల ధ్రువపత్రాలు బుధవారం పరిశీలించారు.
వర్సిటీలో అడ్మిషన్స్ కార్యాలయంలో దివ్యాంగులు, ఎన్సీసీ(NCC), సీఏపీ, ఇతర ఏటగిరీలకుకు సంబంధించి ధ్రువపత్రాలు పరిశీలన జరిపారు. ఎన్సీసీ ఆరుగురు, స్పోర్ట్స్ కోటాలో ముగ్గురు, సీఏపీలో ముగ్గురు మొత్తం 12మంది విద్యార్థులు హాజరైనట్లు దోస్త్ కో- ఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ రామస్వామి, వర్సిటీ పీడీ డా నేత, టెక్నికల్ అసిస్టెంట్ నరేష్, రవీందర్ నాయక్ పాల్గొన్నారు.