అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: Indur tirumala | శ్రవణ నక్షత్రం సందర్భంగా ఇందూరు తిరుమల నర్సింగ్ పల్లి ఆలయంలో (Narsingpalli temple) వేంకటేశ్వర స్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించారు.
భక్తులు భారీగా తరలివచ్చి ఉత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆచార్య సంపత్ కుమార స్వామి మాట్లాడుతూ.. స్వామి వారి కల్యాణోత్సవంలో పాల్గొంటే కన్యాదాన ఫలం వస్తుందని తెలిపారు. ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహా రెడ్డి (Narasimha Reddy) మాట్లాడుతూ.. ఇక నుంచి ప్రతినెలా శ్రవణ నక్షత్రం రోజు తొమ్మిది జంటలకు అవకాశం ఇచ్చి.. వారితో స్వామి వారి కల్యాణం నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రోహిత్ కుమారాచార్య, నరాల సుధాకర్, విజయ్, అనిల్, నర్సారెడ్డి, పృథ్వీ, భాస్కర్, సాయిలు, నరేశ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.
