అక్షరటుడే, వెబ్డెస్క్:PM modi | ప్రధానమంత్రి నరేంద్రమోదీని 14 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) కుటుంబంతో సహా కలిశాడు. మోదీ శుక్రవారం బీహార్లో పర్యటించారు.
ఈ సందర్భంగా పాట్నా ఎయిర్పోర్టు (Patna Airport) వద్ద చిచ్చర పిడుగు వైభవ్ తన తల్లిదండ్రులతో పాటు ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఇందుకు సంబంధించిన చిత్రాలను మోదీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ఆయన ప్రశంసించారు. భవిష్యత్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు.
కాగా.. చిన్న వయస్సులో క్రికెటర్గా ఎదిగిన సూర్యవంశీ తాజా ఐపీఎల్(IPL)లో అరంగేట్రం చేశాడు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తరఫున ఆడిన ఈ చిచ్చర పిడుగు తన తొలి మ్యాచ్లోనే 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. గుజరాత్ జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీతో చెలరేగాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 40, సీఎస్కేతో 57 పరుగులు చేశాడు. మొత్తం ఐపీఎల్లో ఏడు మ్యాచ్లు ఆడిన వైభవ్ 252 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.