అక్షరటుడే, వెబ్డెస్క్: Lalitpur Pharma Park | ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ లలిత్పూర్, బుందేల్ఖండ్ ప్రాంతంలో కొత్త ఫార్మా పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ఐదు గ్రామాల్లో మొత్తం 1,472 ఎకరాల భూమిని గుర్తించారు. రాంపూర్ – 441 ఎకరాలు, సైద్పూర్ – 426 ఎకరాలు, గడోలికలా – 249 ఎకరాలు, లార్గన్ -239 ఎకరాలు, కరౌండా – 116 ఎకరాలుగా నిర్ణయించారు. ఈ భూభాగంలో సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించి, నిర్దిష్ట బిడ్ ప్రక్రియ కింద సర్వే ఏజెన్సీ ఎంపిక కోసం ఈ-టెండర్ను విడుదల చేసింది.
Lalitpur Pharma Park | గొప్ప అభివృద్ధి..
ఎంపికయ్యే ఏజెన్సీ మట్టి పరీక్షలు (soil testing), భౌగోళిక సర్వేలు (topographical investigation) చేపట్టనుంది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో అత్యవసర అభివృద్ధి పనుల కోసం 300 ఎకరాలను ప్రాధాన్యంగా తీసుకుంటారు. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు సుమారు ₹8,000 కోట్లుగా అంచనా వేయబడింది. ఈ ఫార్మా పార్క్ రాష్ట్ర ఔషధ రంగానికి పెద్ద దన్నుగా నిలిచే అవకాశం ఉండడంతో పాటు, ఉత్తరప్రదేశ్లో పరిశ్రమల వృద్ధికి, ఆర్థికాభివృద్ధికి బలమైన ఆధారంగా మారనుంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) నాయకత్వంలో రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలోనే బుందేల్ఖండ్ ప్రాంతంలోని లలిత్పూర్ జిల్లా(Lalitpur District)లో బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దేశ ఔషధ అవసరాలను తీర్చడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇది కీలకమైన చర్య. లలిత్పూర్లో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్ రాష్ట్రానికి, దేశానికి ఔషధ ఉత్పత్తుల కేంద్రంగా మారుతుంది. ఉన్నత నాణ్యత గల చవకైన ఔషధాల ఉత్పత్తి ఈ ప్రాజెక్టు ఉద్దేశం. బల్క్ డ్రగ్ ఉత్పత్తిలో భారతదేశ ఆత్మనిర్భరతను పటిష్టం చేస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) ద్వారా ఈ పార్క్ అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ ఔషధ రంగంలోని ప్రముఖ సంస్థలను ఆకర్షించేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (Expression of Interest) ఇప్పటికే విడుదల చేశారు.