అక్షరటుడే, వెబ్డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తాజాగా అగ్రరాజ్యం అమెరికా చేరింది. ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై యూఎస్ తమ ఫైటర్ జెట్లతో భీకర దాడికి దిగింది. ఇరాన్పై దాడి చేసి ఫైటర్ జెట్లు సురక్షితంగా తిరిగి వెనక్కి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ఫోర్డోపై బాంబులు వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు నిర్వహించాం. విమానాలు సురక్షితంగా తిరిగివచ్చాయి. అమెరిఇరాన్పై అమెరికా విరుచుకుపడింది. అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఫోర్డో, ఇస్ఫాహన్, నతాంజ్ అణుకేంద్రాలపై భారీ దాడులు చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ‘‘ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు నిర్వహించాం. అమెరికా సైనిక యోధులకు అభినందనలు. ఇప్పుడు ఇక శాంతికి సమయం.’’ అని పోస్టు చేశారు. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడికి పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అణు కేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబర్లతో తాము విజయవంతమైన దాడిని పూర్తి చేసినట్లు ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ″అన్ని విమానాలు సురక్షితంగా వెనక్కి చేరుకున్నాయి. మన అమెరికన్ వారియర్లకు అభినందనలు. ప్రపంచంలో మరే సైన్యం ఈ సాహసం చేయలేదు. ఇక ఇది శాంతికి సమయం!” అని ట్రంప్ పేర్కొన్నారు. శనివారం రాత్రి 10 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తానని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
ఇటీవలే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న వివాదం దౌత్యపరంగా పరిష్కరించడానికి అమెరికా రెండు వారాలు సమయం ఇస్తున్నట్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. ఆ మాట చెప్పిన 48 గంటలల్లోపే ఇరాన్పై బీ 2 బాంబర్లతో విరుచుపడ్డారు.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఓ వైపు ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తోందనే ప్రచారంలో ఉంది. ఇప్పుడేమో ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా జత కలిసింది. ఇరాన్పై దాడికి పాల్పడింది. ఈ తరుణంలో మరి చైనా, రష్యా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామం మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా మొదలైంది.