అక్షర టుడే, ఇందల్వాయి/కామారెడ్డి : Indalwai | ఇందల్వాయిలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో రైతులు (farmers) తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు (paddy purchase center) తీసుకురాగా, ఒక్కసారిగా కురిసిన వర్షంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. సకాలంలో తూకాలు వేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
కామారెడ్డి kamareddy నియోజకవర్గంలో బలమైన ఈదురు గాలులకు రహదారులపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలుచోట్ల ఇళ్లపై రేకులు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. దీంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు.
