అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ (police pre-arrested) చేశారు. పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు.
Nizamabad City | అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లా (Nizamabad district) పర్యటన సందర్భంగా ముందస్తు పేరుతో వామపక్ష నాయకులను అక్రమగా అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సీపీఐ ఎమ్మెల్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ తెలిపారు. టీయూసీఐ, పీడీఎస్యూ, అఖిల భారత కూలీ సంఘం, సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సీపీఎం నాయకులను ఉమ్మడి జిల్లాలో అరెస్టులు (joint district arrests) చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారన్నారు. ముందస్తు పేరుతో పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Nizamabad City | నేడు మధ్యాహ్నం జిల్లాకు అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) నేడు మధ్యాహ్నం జిల్లాకు రానున్నారు. పసుపు బోర్డు (Turmeric Board) కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం బసవ గార్డెన్ లో రైతులతో ముచ్చటించనున్నారు. అలాగే దివంగత మాజీమంత్రి డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తగనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించనున్న రైతు సభలో ప్రసంగించారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.