అక్షరటుడే, నిజామాబాద్ సిటీ:Nizamabd City | నగరంలోని ఒకటో టౌన్(1 Town) పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు ఎస్హెచ్వో రఘుపతి(SHO Raghupathi) తెలిపారు. ఈనెల 29న మధ్యాహ్నం దేవి రోడ్లోని మేఘ వైద్యనాథ్ ఆయుర్వేదిక్(Megha Vaidyanath Ayurvedic) దుకాణం వద్ద మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండగా, స్థానికులు డయల్ 100కు సమాచారమిచ్చారు.
దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతురాలి వయసు 35–40 ఏళ్లు ఉంటుందని, ఒంటిపై వంకాయ కలర్ చీర, నీలి రంగు బ్లౌజ్ ధరించి ఉందన్నారు.