అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
బుధవారం అక్కన్నపేట (Akkanapet) వద్ద గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా నిజామాబాద్ వైపు నుంచి వస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ (Rayalaseema Express) ఢీకొంది. దీంతో తీవ్రగాయాల పాలైన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే.. రైల్వే ఎస్సై సాయిరెడ్డి (Railway Sub-Inspector Sai Reddy) లేదా కామారెడ్డి ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ హన్మాండ్లును సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.