More
    Homeఆంధ్రప్రదేశ్​Banakacharla Project | మార‌ని ఆంధ్ర మీడియా.. తెలంగాణ ప్ర‌యోజ‌నాలు దెబ్బ తీసే ఎత్తుగ‌డ

    Banakacharla Project | మార‌ని ఆంధ్ర మీడియా.. తెలంగాణ ప్ర‌యోజ‌నాలు దెబ్బ తీసే ఎత్తుగ‌డ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacharla Project | తెలంగాణ భావ‌జాలాన్ని తొలి నుంచి వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన ఆంధ్ర మీడియా(Andhra Media).. రాష్ట్ర విభ‌జన త‌ర్వాత కూడా మార‌లేదు. తెలంగాణకు వ్య‌తిరేకంగా దుష్ప్ర‌చారం చేయ‌డంలో, ప్ర‌జ‌ల‌ మెద‌ళ్ల‌లో విష బీజాలు నాట‌డంలో త‌మ‌ వైఖ‌రిని మార్చుకోలేదు. ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న ఈ వ్య‌తిరేక ధోర‌ణిని ఆంధ్ర పత్రిక‌లు, చాన‌ళ్లు ఇప్ప‌టికీ కొన‌సాగిస్తున్నాయి. అందుకు తాజా నిద‌ర్శ‌న‌మే బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు(Banakacharla Project) అంశం. తెలంగాణ భూముల‌ను ఎండ‌బెట్టి, ఈ ప్రాంత రైతుల నోట్లో మ‌ట్టి కొట్టే ఈ ప్రాజెక్టును స‌మ‌ర్థిస్తూ తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్నది. త‌ప్పుడు క‌థ‌లు ప్ర‌సారం చేస్తున్నది. స‌ముద్రంలో వృథాగా క‌లిసిపోయే మిగులు జ‌లాల‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ ప్ర‌భుత్వం(Andhra Pradesh Government) చేస్తున్న ప్ర‌య‌త్నం త‌ప్పెలా అవుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్న‌ది.

    Banakacharla Project | బ‌న‌క‌చ‌ర్ల చిచ్చు..

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిస్తున్న బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చిచ్చు పెట్టింది. మిగులు, వ‌ర‌ద జ‌లాల ఆధారంగా దాదాపు రూ.82 వేల కోట్ల అంచ‌నా వ్య‌యంతో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఇప్ప‌టికే ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎప్ ఆర్‌), స‌మ‌గ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను కేంద్రానికి స‌మ‌ర్పించిన ఏపీ.. అనుమ‌తులు తెచ్చుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. మోదీ స‌ర్కారు(Modi government) మ‌నుగ‌డ‌లో కీల‌కంగా మారిన తెలుగుదేశం పార్టీ.. దీన్ని సాకుగా తీసుకుని కేంద్రం నుంచి రావాల్సిన అనేక ప్ర‌యోజ‌నాల‌ను తెచ్చుకుంటోంది. అయితే, బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను తీవ్రంగా దెబ్బ తీస్తున్న‌ప్ప‌టికీ, అలాంటిదేమీ ఉండ‌ద‌ని తాము మిగులు జ‌లాల‌నే వినియోగించుకుంటామ‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు(AP Chief Minister Chandrababu) చెబుతున్నారు. తెలంగాణ ప్రాజెక్టుకు తామెప్పుడూ అడ్డు ప‌డ‌లేద‌ని, త‌మ ప్రాజెక్టుల విష‌యంలో అడ్డుప‌డ‌డం స‌రికాద‌ని ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. అయితే, తెలంగాణ స‌ర్కారు మాత్రం ఈ ప్రాజెక్టును అడ్డుకుని తీర‌తామ‌ని, ఇందుకోసం అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తామ‌ని తెలిపింది. కేంద్రానికి ఫిర్యాదు చేయ‌డంతో పాటు న్యాయ పోరాటం చేస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్ర‌క‌టించారు.

    READ ALSO  Traffic constable | టిప్పర్​ సడెన్​ బ్రేక్.. ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం

    Banakacharla Project | విష బీజాలు నాటుతున్న మీడియా..

    రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం రెండు ప్ర‌భుత్వాలు త‌మ వైఖ‌రిని స్ప‌ష్టం చేస్తుంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియా(Mainstream media) మాత్రం ఒక‌వైపు వాద‌న‌ను మాత్ర‌మే ప్ర‌చారంలోకి తీసుకొస్తోంది. ఏపీ వైఖ‌రిని స‌మ‌ర్థిస్తూ, బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు నిర్మాణానికి మ‌ద్ద‌తు తెలుపుతూ క‌థ‌నాల‌ను ప్ర‌చారం చేస్తోంది. ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిస్తోంది. బ‌న‌క‌చ‌ర్ల వ‌ల్ల తెలంగాణ(Telangana) ప్ర‌యోజ‌నాల‌కు ఎలాంటి న‌ష్టం లేద‌ని వాద‌న‌ను తెర పైకి తీసుకొస్తోంది. ఇందుకోసం అబ‌ద్ధ‌పు, అస‌త్య‌పు క‌థ‌నాల‌ను అల్లి ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌లో విష‌బీజాలు నాటుతోంది. తెలంగాణ రైతుల‌కు తీవ్ర న‌ష్ట‌మ‌ని జ‌రుగుతున్న వాద‌న‌ను తొక్కిపెడుతూ, ప్రాజెక్టు వ‌ల్ల రెండు రాష్ట్రాల‌కు లాభం జ‌రుగుతుంద‌నే స్థాయిలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

    తొలినుంచి తెలంగాణ వాదాన్ని, భావ‌జాలాన్ని వ్య‌తిరేకించిన ఆంధ్ర పత్రిక‌లు, చాన‌ళ్లు ఇప్పుడు ఏపీ ప్రాజెక్టుకు వంత పాడుతూ క‌థ‌నాలు వండి వార్చుతుండ‌డంపై తెలంగాణ ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఆంధ్ర ప‌త్రిక‌లు, చాన‌ళ్లు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తాజాగా తెలంగాణ సోష‌ల్ ఫౌండేష‌న్ (టీఎస్ ఎఫ్‌) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఒంటెద్దు న‌ర్సింహారెడ్డి(Narasimha Reddy) ఎత్తి చూపారు. తెలంగాణ జ‌ల వ‌నరులు-వ్య‌వ‌సాయం- నాడు, నేడు, రేపు అంశంపై హైద‌రాబాద్‌లో జ‌రిగిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో.. ఆయ‌న మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతానికి మ‌ద్ద‌తుగా, తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా విద్వేషాలు రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలను ఆయ‌న ప్ర‌స్తావించారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఆంధ్రా మీడియా దానిని వక్రీకరించి రాస్తుందని మండిప‌డ్డారు. బనకచర్ల తో మనకు నష్టం జరిగితే.. తెలంగాణకు బనకచర్ల తో నష్టం లేదని ఆంధ్రా పేపర్లు రాస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు దీన్ని గమనించాలని, ఆంధ్రా మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    READ ALSO  Raymond Group | ఏపీలో ‘రేమండ్’​ భారీ పెట్టుబడులు.. గార్మెటింగ్, ఏరోస్సేస్, రక్షణ రంగాల్లో రూ.1,200 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌

    Latest articles

    ACB Trap | లంచం తీసుకుంటూ దొరికిన అకౌంట్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏసీబీ...

    CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్​ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి...

    Mahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | ఈ రోజుల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. బ‌స్సులో వెళ్లినా,...

    Jagannath Rath Yatra | జగన్నాథుడి సేవలో అదానీ.. 40 లక్షల మందికి ఉచితంగా ఆహారం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagannath Rath Yatra | దేశంలో ఎంతో ఘనంగా జరిగే పూరి జగన్నాథుడి రథయాత్రకు...

    More like this

    ACB Trap | లంచం తీసుకుంటూ దొరికిన అకౌంట్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. నిత్యం ఏసీబీ...

    CM Revanth Reddy | డ్రగ్స్‌ నియంత్రణకు కీలక చర్యలు.. ఈగల్‌ వ్యవస్థ ఏర్పాటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రంలో డ్రగ్స్​ నియంత్రణకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి...

    Mahabubabad | కుబేర‌ సినిమా చూస్తుండ‌గా కూలిన సీలింగ్.. పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mahabubabad | ఈ రోజుల్లో ప్ర‌జ‌ల ప్రాణాల‌కు గ్యారెంటీ లేకుండా పోయింది. బ‌స్సులో వెళ్లినా,...