అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | కడుపునొప్పి భరించలేక ఓ యువకుడు గడ్డిమందు తాగగా.. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్సై సందీప్ (SI sandeep) తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలంలోని గన్నారం (Gannaram) గ్రామానికి చెందిన నాగుల హరికృష్ణ (22) కడుపునొప్పి భరించలేక మూడురోజుల క్రితం గడ్డి మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
అక్కడి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చేతికందిన కొడుకు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.