అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold rates | భారతీయ మహిళలు Indian Womens తమకంటూ కొంత బంగారం gold ornaments ఉండాలని కోరుకుంటారు. అంతేకాదు నాలుగు రూపాయలు జమైతే చాలు కొంత బంగారం gold purchase కొనిపెడతారు. వాటితో ఆభరణాలు చేయించుకొని ధరిస్తారు. మరికొందరు తమ పిల్లల పెళ్లిళ్లు, భవిష్యత్ కోసమని ముందు నుంచే పసిడి కొని పెట్టుకుంటారు. రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలు gold rates అలా పసిడి కొని పెట్టుకున్న మహిళలను లక్షాధికారులను చేశాయి.
ప్రస్తుతం తులం బంగారం రూ.లక్ష దాటడంతో గతంలో బంగారం కొన్న వారిని ప్రశంసిస్తూ.. ప్రముఖ బ్యాంకర్, కోటక్ మహీంద్రా kotak mahindra bank founder బ్యాంక్ ఫౌండర్ ఉదయ్ కోటక్ uday kotak ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. భారతీయ గృహిణులను ‘స్మార్టెస్ట్ ఫండ్ మేనేజర్స్’గా Fund Managers ఆయన అభివర్ణించారు. ఎందుకంటే, చాలా కాలంగా వారు తమ పొదుపు savings లో కొంత భాగాన్ని బంగారంలో పెట్టుబడి investment పెడుతూ వస్తున్నారని, ఇప్పుడు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వారే నిజమైన విజేతలని ఆయన కొనియాడారు. ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు, ఆర్థికవేత్తలు భారత్ నుంచి ఈ విషయంలో నేర్చుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Gold rates | ఆపత్కాలంలో సంజీవని
ఇంట్లో ఉన్న బంగారం ఆపత్కాలంలో సంజీవనిలా పనిచేస్తుంది. ఆరోగ్యం బాగా లేకపోయిన, పంటలకు పెట్టుబడి కావాలన్నా.. ఇళ్లు కట్టడానికి డబ్బు సరిపోకపోయినా.. కొత్త బిజినెస్ స్టార్ట్ new buissiness startup చేయడానికి అయినా.. మధ్య తరగతి వారికి ముందుగా గుర్తొచ్చేది బంగారం. అత్యవసరం అయితే ఇంట్లో ఉన్న బంగారాన్ని విక్రయించి డబ్బులు పొందుతారు. లేదంటే పసిడిని తాకట్టు పెట్టి లోన్లు gold loans తీసుకుంటారు. ఇలా భారతీయ మహిళలు కొనుగోలు చేసి పెట్టుకున్న బంగారం ఎన్నో సందర్భాల్లో కుటుంబాలను నిలబెట్టింది. ప్రస్తుతం పసిడి ధర రూ.లక్ష దాటడంతో బంగారం దాచుకున్న మహిళలు ధనవంతులు అయ్యారని కోటక్ మహీంద్ర అన్నారు.