అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: ACP Raja Venkat Reddy | వరుస బైక్చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తన కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. బాన్సువాడ (Banswada) మండలం సోమేశ్వర్ గ్రామానికి చెందిన పిట్ల మొగులయ్య గత నెల 19న నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో బైకు చోరీకి గురైందని వన్ టౌన్ పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
బుధవారం బోధన్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వారిని విచారించగా బోధన్ పట్టణానికి చెందిన మాలోతు రమేష్, కటం రవిలుగా గుర్తించారు. వారు బైకు చోరీలకు పాల్పడినట్లు గుర్తించడంతో పాటు వారి వద్ద నుంచి చోరీలకు పాల్పడిన ఆరు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు.