అక్షరటుడే, ఇందూరు: TUWJ-IJU : కొత్తగా బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని (Nizamabad Collector Vinay Krishna Reddy) శనివారం టీయూడబ్ల్యూజే – ఐజేయూ (TUWJ-IJU) ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టర్ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ వెల్నెస్ సెంటర్లో మందుల కొరత సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
స్పందించిన కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని, మందుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ను కలిసిన వారిలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొబ్బిలి నర్సయ్య, అహ్మద్ అలీఖాన్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు గంగాదాస్, ప్రెస్ క్లబ్ కార్యదర్శి భైర శేఖర్, జిల్లా కోశాధికారి సిరిగాధ ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి ధనుంజయ్, చతుర్వేదం, మహేష్ రెడ్డి ఉన్నారు.
TUWJ-IJU : సాయిలుకు పరామర్శ…
బోధన్ ప్రజాజ్యోతి ఆర్సీ ఇన్ఛార్జి టప్ప సాయిలు బ్రెయిన్ ట్యూమర్ తో నిజామాబాద్ హోప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన్ను టీయూడబ్ల్యూజే – ఐజేయూ ప్రతినిధులు కలిసి పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు.