More
    Homeఅంతర్జాతీయంBOYCOTT TURKEY | తుర్కియేకు షాక్.. యూనివర్సిటీ బప్పందాన్ని రద్దు చేసిన JNU

    BOYCOTT TURKEY | తుర్కియేకు షాక్.. యూనివర్సిటీ బప్పందాన్ని రద్దు చేసిన JNU

    Published on

    అక్షరటుడే, న్యూఢిల్లీ: BOYCOTT TURKEY | పహల్​గామ్​​ ఉగ్రదాడి(Pahalgaon terror attack) తర్వాత పాకిస్తాన్​​పై భారత్ ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor) చేపట్టింది. దీంతో ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమయంలోనే పాకిస్తాన్ (Pakistan) ​కు తుర్కియే మద్దతు ఇవ్వడంపై భారతదేశంలో ​తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

    ఇప్పటికే తుర్కియేకు ఆన్‌లైన్‌ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు మన ట్రావెల్‌ ఏజెన్సీలు ప్రకటించాయి. ఈ క్రమంలోనే తుర్కియేలోని ఇనొను యూనివర్సిటీ(Inonu University)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు తాజాగా ఢిల్లీ(Delhi)లోని ప్రఖ్యాత జేఎన్‌యూ(JNU) ప్రకటించింది.

    దేశ భద్రత దృష్ట్యా ఇనొను యూనివర్సిటీ (Inonu University)తో కుదుర్చుకున్న ఎంవోయూను నిలిపేస్తున్నట్లు జేఎన్‌యూ సీనియర్‌ అధికారి చెప్పారు. ఈ ఒప్పందంలో అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరుదేశాల వర్సిటీల మధ్య ఇటీవల మూడేళ్ల కాల పరిమితికి విద్యాపరమైన ఒప్పందం కుదిరింది.

    READ ALSO  Israel | ఇజ్రాయెల్​ ప్రధాని కొడుకు పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా..

    తుర్కియేలోని మలట్యా(Malatya)లో ఇనొను యూనివర్సిటీ ఉంది. విభిన్న సాంస్కృతిక పరిశోధనలు, విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఇటీవల జేఎన్‌యూ, ఇనొను వర్సిటీల మధ్య ఎంవోయూ కుదిరింది. తాజా పరిణామాల నేపథ్యంలో సదరు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ జేఎన్‌యూ నిర్ణయం తీసుకుంది.

    తుర్కియేలో కొన్నేళ్ల క్రితం భూకంపం(earthquake) వచ్చింది. ఆ సమయంలో భారత్​ తక్షణం స్పందించి, అన్నివిధాలా సాయం అందించింది. కానీ, పహల్​గామ్​ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్​కు బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor)తో భారత్ దాడి చేసింది.

    కానీ, ఈ సమయంలో పాక్‌కు తుర్కియే బాంబు డ్రోనులను సరఫరా చేసింది. మిలిటరీ సిబ్బందిని కూడా పంపించింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు బాయ్‌కాట్‌ తుర్కియే(Boycott turkey) పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తుర్కియే వస్తువులు, పర్యాటకాన్ని బహిష్కరించాలన్న డిమాండ్లు ఉన్నాయి.

    READ ALSO  Maharashtra | వృద్ధుడి పంచన చేరింది.. సపర్యలు చేసింది.. ఆస్తి రాయించుకుని దారుణంగా బయటకు గెంటేసింది..

    ఇప్పటికే తుర్కియే ఆన్​లైన్ బుకింగ్​లను నిలిపివేశారు. మరోవైపు మహారాష్ట్ర(Maharashtra)లోని పుణె (Pune) వ్యాపారులు తుర్కియే నుంచి వచ్చే యాపిల్స్​ను సైతం పూర్తిగా బహిష్కరించారు. తుర్కియే యాపిల్స్​ను దిగుమతి చేసుకోవడం మానేశారు. అలా పుణె మార్కెట్ యార్డు (Pune market yards) ల్లో తుర్కియే యాపిల్స్ కనుమరుగయ్యాయి. రానున్న రోజుల్లో తుర్కియేతో భారత్​ వాణిజ్య సంబంధాలు సైతం తగ్గే అవకాశాలు లేకపోలేదు.

    Latest articles

    Old City Metro | పాత బస్తీ మెట్రోకు బడ్జెట్ ఆమోదం.. రూ.125 కోట్లు విడుదల

    అక్షరటుడే, హైదరాబాద్: Old City Metro : జీహెచ్​ఎంసీ(GHMC) పరిధిలోని పాత బస్తీ మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టుకు తెలంగాణ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 17 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – మంగళవారంమాసం – జ్యేష్ఠపక్షం...

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    More like this

    Old City Metro | పాత బస్తీ మెట్రోకు బడ్జెట్ ఆమోదం.. రూ.125 కోట్లు విడుదల

    అక్షరటుడే, హైదరాబాద్: Old City Metro : జీహెచ్​ఎంసీ(GHMC) పరిధిలోని పాత బస్తీ మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టుకు తెలంగాణ...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 17 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – మంగళవారంమాసం – జ్యేష్ఠపక్షం...

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...