ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    Published on

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను ఏర్పాటు చేసింది. మంగళవారం దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (Tirumala Tirupati Devasthanams Board) ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు Chairman B.R. Naidu, ఈవో శ్యామలరావు EO Shyamala Rao ప్రారంభించారు.

    Tirumala : ప్రయోజనం ఏమిటంటే..

    స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్య ఉండదు. తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించగలిగే విధంగా పరిశోధనశాలను తీర్చిదిద్దారు.

    Tirumala : కల్తీ నెయ్యి వ్యవహారంతో..

    తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదని ఇప్పటివరకు లేదు. కాగా, గతంలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూడటంతో.. తాజాగా స్థానికంగానే నెయ్యి నాణ్యతను పరీక్షించే ఏర్పాట్లను చేశారు.

    READ ALSO  Jal Shakti meeting | కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయం.. జల వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ

    నెయ్యిలో నాణ్యత శాతం, కల్తీ శాతాన్ని వెంటనే విశ్లేషించే HPLC (High Performance Liquid Chromatograph), GC (Gas Chromatograph) యంత్రాలు ఏర్పాటు చేశారు. ఈ యంత్రం విలువ రూ.75 లక్షల వరకు ఉంటుంది. దీనిని గుజరాత్​ (Gujarat) కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (National Dairy Development Board – NDDB) విరాళంగా అందజేసింది.

    Tirumala : మైసూర్​లో ప్రత్యేక శిక్షణ..

    ఆహార నాణ్యత పరిశీలనలో పాలుపంచుకునే సిబ్బంది, పోటు కార్మికులకు మైసూర్‌ (Mysore) లోని CFTRIలో ప్రత్యేక శిక్షణ అందించారు. ఆహార నాణ్యత పరిశోధనశాల ప్రారంభ వేడుకలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, సదాశివరావు, నరేష్, సీఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు సోమన్నారాయణ, భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.

    READ ALSO  Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Latest articles

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    Canon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్​...

    Kamareddy | ప్రేమలో పడిన కూతురు.. తల్లి ఆత్మహత్యాయత్నం.. రైల్వే ట్రాక్ పై కాపాడిన పోలీసులు

    అక్షరటుడే కామారెడ్డి : Kamareddy : కూతురు ఎవరినో ప్రేమించడం ఆ తల్లి mother జీర్ణించుకోలేకపోయింది. అల్లారు ముద్దుగా...

    More like this

    Kanwar Yatra | కన్వర్​ యాత్రికులపై ఆగని ఆగడాలు..! సుప్రీంకోర్టు జోక్యం.. యూపీ సర్కారు కీలక నిర్ణయం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kanwar Yatra : కన్వర్​ యాత్ర.. ఏటా శ్రావణ మాసంలో జరిగే ఈ వేడుకలో భక్తులపై...

    Supreme Court | జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్​ఐఆర్​కు సుప్రీంకోర్టు నిరాకరణ.. న్యాయవాది తీరుపై అసహనం

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant...

    Canon camera | టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి..

    అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్​...