అక్షరటుడే, న్యూఢిల్లీ: Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్తాన్ వివాదాన్ని తానే ఆపినట్లు చెప్పుకొచ్చారు. భారత్-పాకిస్తాన్ సైన్యాల మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాతే సైనిక చర్య నిలిపివేశామని.. ఇందులో మూడో పక్షం ప్రమేయం లేదని ప్రధాని మోడీ, ట్రంప్నకు తెగేసి చెప్పి కొన్ని గంటలు కూడా అవ్వకముందే మరోసారి డొనాల్డ్ ట్రంప్ “యుద్ధం నేనే ఆపాను” అంటూ స్వయంగా ప్రకటించుకున్నారు.
వైట్ హౌజ్(White House)లో విలేకరులతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. ప్రధాని మోడీ(Prime Minister Modi) ఒక “అద్భుతమైన వ్యక్తి” అంటూ అభివర్ణించారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్నారు. “యుద్ధాన్ని నేనే ఆపాను. నేను పాకిస్తాన్ను ప్రేమిస్తున్నాను(I love Pakistan). మోడీ అద్భుతమైన వ్యక్తి.. నిన్న రాత్రి అతనితో నేను మాట్లాడాను. మేము భారత్ తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాం.. పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధాన్ని నేను ఆపాను” అని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Pakistan Army Chief Asim Munir) తో వైట్ హౌజ్లో చర్చల తర్వాత ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నుంచి యుద్ధం ఆపడంలో ఆసిమ్ మునీర్ చాలా ప్రభావవంతంగా పనిచేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. భారత్ వైపు నుంచి మోడీ ఈ సంఘర్షణ ఆపేలా పనిచేశారని చెప్పారు.
కాగా, భారత ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ట్రంప్(US President Trump) తో దాదాపు 3 నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడారు. భారత్ ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని ట్రంప్నకు స్పష్టం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ప్రకటించారు.
మే 7-10 తేదీలలో రెండు దేశాల మధ్య జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణల తర్వాత అమెరికాతో వాణిజ్యం, భారత్-పాక్ మధ్యవర్తిత్వం గురించి అమెరికా ఎప్పుడూ చర్చించలేదని ప్రధాని ట్రంప్నకు తెలిపినట్లు చెప్పారు “పాకిస్తాన్ నుంచి వచ్చే ఏ దురాక్రమణ చర్యకైనా బలమైన ప్రతిస్పందన ఉంటుందని భారత్ స్పష్టం చేసింది” అని విదేశాంగ కార్యదర్శి వెల్లడించారు.