More
    Homeఅంతర్జాతీయంUS President | యాపిల్ సంస్థ‌కు ట్రంప్ వార్నింగ్‌.. అమెరికాలో త‌యారీ చేయకపోతే 25శాతం సుంకం

    US President | యాపిల్ సంస్థ‌కు ట్రంప్ వార్నింగ్‌.. అమెరికాలో త‌యారీ చేయకపోతే 25శాతం సుంకం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : US President | ఐఫోన్ల (I phones) త‌యారీ సంస్థ యాపిల్‌కు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) మ‌రోసారి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అమెరికాలో విక్ర‌యించే ఫోన్ల‌ను స్థానికంగానే త‌యారు చేయాల‌ని సూచించారు. లేక‌పోతే 25 శాతం సుంకం విధిస్తామ‌ని హెచ్చ‌రించారు. భార‌త్ (India) స‌హా మిగ‌తా ఏ దేశంలో ఐ ఫోన్లు త‌యారు చేయొద్ద‌ని అలా చేస్తే సుంకం త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేశారు. “భారతదేశంలో లేదా మరెక్కడైనా” ఐఫోన్ల తయారీని కొనసాగిస్తే ఆపిల్ (Apple) ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం బెదిరించారు. ఈ మేర‌కు త‌న సోషల్ మీడియా (social media account) ట్రుత్‌లో ఓ పోస్ట్ పెట్టారు. టెక్ మేజర్ వాషింగ్టన్‌కు 25 శాతం సుంకం చెల్లించాలని ట్రంప్ అన్నారు.

    READ ALSO  Israel – Iran | ఇరాన్ ఒప్పందానికి రాకుంటే వినాశనమే.. ఇజ్రాయెల్ దాడిని అద్భుతమని వర్ణించిన ట్రంప్

    US President | అమెరికాలో త‌యారు చేయాలి

    యాపిల్ త‌న ఉత్ప‌త్తుల‌ను అమెరికాలోనే (America) త‌యారు చేయాల‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. లేక‌పోతే ప‌న్ను క‌ట్టాల్సి ఉంటుంద‌న్నారు. “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో (United States of America) విక్రయించే ఐఫోన్‌లను అమెరికాలోనే త‌యారు చేయాలి. భారతదేశంలో (India) లేదా మరెక్కడా కాద‌ని చాలా కాలం క్రితమే టిమ్ కుక్‌కు (Tim cook) తెలియజేసా. అలా కుద‌ర‌దంటే క‌నీసం 25 శాతం సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని” అని ట్రంప్ పోస్ట్ చేశారు.

    US President | భార‌త్ వైపు యాపిల్ మొగ్గు

    చైనాపై అమెరికాల సుంకాల (US tariffs) ప్ర‌భావం నేప‌థ్యంలో ఆ దేశం నుంచి త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల‌ను త‌ర‌లించేందుకు యాపిల్ స‌న్నాహాలు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో భార‌త్‌లో ఐఫోన్ల త‌యారీ ప‌రిశ్ర‌మ‌ను విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌ట్టింది. ఈ విస్త‌ర‌ణ ప్ర‌క్రియ‌పై ఇటీవ‌లే స్పందించిన ట్రంప్‌.. భారత్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డాన్ని నిలిపివేయాల‌ని యాపిల్ సీఈవో టిమ్ కుక్‌కు (Apple CEO Tim Cook) సూచించారు. భార‌త్ లో యాపిల్ భారీగా త‌యారీ కార్యక్రమాలు చేప‌డుతోందని, ఇది త‌నకు ఇష్టం లేద‌ని పేర్కొన్నారు. అయితే, ఆపిల్ భారతదేశంలో తన కార్యకలాపాలను తగ్గించుకునే సూచనలు లేవు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత అధికారులు ఆపిల్ ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడారని, ఇండియాలో టెక్ దిగ్గజం పెట్టుబడి ప్రణాళికలు చెక్కుచెద‌ర‌కుండా ఉన్నాయ‌ని హామీ ఇచ్చారని భారత ప్రభుత్వ వర్గాలు (Indian government sources) ధ్రువీకరించాయి. అయితే, తాజాగా మ‌రోమారు ఈ అంశంపై స్పందించిన ట్రంప్‌.. అమెరికాలో ఐఫోన్ల‌ను త‌యారు చేయ‌కుంటే సుంకాల చెల్లించ‌క త‌ప్ప‌దంటూ హెచ్చ‌రించారు.

    READ ALSO  US Army Day | యూఎస్​ ఆర్మీ డే వేడుకలు.. పాక్​ ఆర్మీ చీఫ్​ను ఆహ్వానించలేదని ప్రకటన

    US President | 40 మిలియన్ ఐఫోన్ల ఉత్ప‌త్తి..

    ఆపిల్ ప్రస్తుతం ఇండియాలో ఏటా 40 మిలియన్ ఐఫోన్లను (40 million iPhones) అసెంబుల్ చేస్తోంది. ఇది దాని ప్రపంచ ఉత్పత్తిలో (global production) దాదాపు 15% వాటా కలిగి ఉంది. తమిళనాడులో (Tamil Nadu) ఫాక్స్‌కాన్‌తో (Foxconn) పాటు ఇటీవల పెగాట్రాన్ నుంచి కార్యకలాపాలను స్వాధీనం చేసుకున్న టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) ఐఫోన్లను త‌యారీ చేస్తున్నాయి. రెండు కంపెనీలు తమ సౌకర్యాలను విస్తరిస్తున్నాయి. సామర్థ్యాన్ని పెంచడానికి కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. మ‌రోవైపు, భార‌త ప్ర‌భుత్వానికి (Indian government) యాపిల్ నుంచి మంచి ఆదాయం స‌మకూరుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇండియా ₹1.5 లక్షల కోట్ల ($18 బిలియన్లు) విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnav) గత నెలలో ప్రకటించారు. భారతదేశంలో ఆపిల్ సరఫరా గొలుసు దాదాపు 2,00,000 మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా.

    READ ALSO  Austria | ఆస్ట్రియా స్కూల్‌లో కాల్పుల మోత‌.. 8 మంది దుర్మ‌ర‌ణం

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....