More
    Homeఅంతర్జాతీయంTrump | మోదీని అమెరికాకు ఆహ్వానించిన ట్రంప్‌.. సున్నితంగా తిర‌స్క‌రించిన ప్ర‌ధాని

    Trump | మోదీని అమెరికాకు ఆహ్వానించిన ట్రంప్‌.. సున్నితంగా తిర‌స్క‌రించిన ప్ర‌ధాని

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Trump | కెన‌డా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని అమెరికాకు రావాల‌ని అగ్ర‌రాజ్య అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆహ్వానించారు. అయితే, ఈ ఆహ్వానాన్ని ప్ర‌ధాని సున్నితంగా తిర‌స్క‌రించారు. ముంద‌స్తు షెడ్యూల్ కార‌ణంగా ఇప్పుడు రాలేక‌పోతున్నాన‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో స‌మీప భ‌విష్య‌త్తులో క‌ల‌వ‌డానికి ప్ర‌య‌త్నించాల‌ని ఇరువురు నాయ‌కులు నిర్ణ‌యించారు.

    ఈ విష‌యాన్ని విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్రీ (Foreign Secretary Vikram Misri) బుధ‌వారం వెల్ల‌డించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారని, దాదాపు 35 నిమిషాల పాటు వారి మ‌ధ్య సంభాష‌ణ జ‌రిగింద‌ని తెలిపారు. “కెనడా నుంచి తిరిగి వస్తున్నప్పుడు అమెరికా(America)లో ఆగుతారా అని ప్రధాని మోదీని అధ్యక్షుడు ట్రంప్ అడిగారు. ముందస్తు షెడ్యూల్ కార‌ణంగా రాలేన‌ని ప్ర‌ధాని బ‌దులిచ్చారు. సమీప భవిష్యత్తులో కలవడానికి ప్రయత్నించాలని ఇద్దరు నాయకులు నిర్ణయించుకున్నారని చెప్పారు. వాస్త‌వానికి జి7 శిఖరాగ్ర సమావేశం(G7 summit)లో ఇద్దరు నాయకులు సమావేశం కావాల్సి ఉందని, కానీ అధ్యక్షుడు ట్రంప్ కెనడాలో జరిగే శిఖరాగ్ర సమావేశం నుంచి హుటాహుటిగా వెళ్లాల్సి రావ‌డంతో భేటీ జరగలేదని మిస్రీ అన్నారు.

    READ ALSO  Ahmedabad Plane Crash | విమాన ప్రమాదంపై మోదీ సమీక్ష

    Trump | మ‌ధ్య‌వ‌ర్తిత్వాన్ని అంగీక‌రించ‌మ‌న్న మోదీ..

    ట్రంప్‌తో మోదీ సంభాష‌ణ సంద‌ర్భంగా ఆప‌రేష‌న్ సిందూర్(Operation Sindoor) గురంచి చ‌ర్చ జ‌రిగింద‌ని మిస్రీ తెలిపారు. కశ్మీర్ అంశంలో మ‌ధ్య‌వ‌ర్తి ప్ర‌మేయాన్ని అంగీక‌రించేది లేద‌న్న భార‌త వైఖ‌రిని ప్ర‌ధాని పున‌రుద్ఘాటించార‌ని చెప్పారు. ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ గురించి ట్రంప్‌కు వివరించారు. ఆపరేషన్ సిందూర్ నేప‌థ్యంలో వాణిజ్యానికి సంబంధించిన ఏ అంశాలను చర్చించలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశార‌న్నారు. “భారతదేశం ఎప్పుడూ మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని, భవిష్యత్తులో అలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని కూడా ప్ర‌ధాని పునరుద్ఘాటించారు” అని మిస్రీ అన్నారు. భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి లేదా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి భార‌త్‌-పాక్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం గురించి ఎటువంటి చర్చ జరగలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశార‌ని తెలిపారు. ఇండియా ఇప్పుడు ఉగ్రవాద చర్యలను ప్రాక్సీ చర్యలుగా కాకుండా యుద్ధ చర్యలుగా పరిగణిస్తుందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారని విదేశాంగ కార్యదర్శి వివ‌రించారు.

    READ ALSO  Israel-Iran Coflict | ఇరాన్ నుంచి ఇండియ‌న్ల త‌ర‌లింపు

    Latest articles

    Begumpet Airport | బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌ట్టిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Begumpet Airport | హైద‌రాబాద్‌(Hyderabad)లోని పాత విమానాశ్ర‌యం బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు(Bomb Threat) రావ‌డంతో న‌గ‌రంలో...

    PM Kisan | ఈ-కేవైసీ చేయించ‌కుంటే పీఎం కిసాన్ రాన‌ట్లే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:PM Kisan | ఈ-కేవైసీ(E-KYC) చేయించుకోని రైతుల‌కు ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న ఇక నుంచి...

    Chiranjeevi | డ్రిల్ మాస్ట‌ర్‌గా చిరంజీవి.. ముస్సోలిలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Chiranjeevi | సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ ఏడాది సంక్రాంతికి వ‌స్తున్నాం...

    BC Sankshema Sangham | బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్

    అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా విజయ్...

    More like this

    Begumpet Airport | బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు.. ముమ్మ‌ర త‌నిఖీలు చేప‌ట్టిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Begumpet Airport | హైద‌రాబాద్‌(Hyderabad)లోని పాత విమానాశ్ర‌యం బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు(Bomb Threat) రావ‌డంతో న‌గ‌రంలో...

    PM Kisan | ఈ-కేవైసీ చేయించ‌కుంటే పీఎం కిసాన్ రాన‌ట్లే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్:PM Kisan | ఈ-కేవైసీ(E-KYC) చేయించుకోని రైతుల‌కు ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి యోజ‌న ఇక నుంచి...

    Chiranjeevi | డ్రిల్ మాస్ట‌ర్‌గా చిరంజీవి.. ముస్సోలిలో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌ర‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Chiranjeevi | సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఈ ఏడాది సంక్రాంతికి వ‌స్తున్నాం...