అక్షరటుడే, నిజాంసాగర్: Bhubarathi | కొత్తగా వచ్చిన భూభారతి చట్టం ద్వారా భూరికార్డుల్లో పారదర్శకత ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు(MLA Lakshmi Kantha Rao) పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎమ్మెల్యేలు కలిసి ఎడ్లబండిపై నిజాంసాగర్ తహశీల్దార్ కార్యాలయం వరకు వచ్చారు.
అనంతరం నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే(MLA thota lakshmikanth rao) మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా భూసమస్యలన్నింటినీ సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్ pitlam market committee, కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు మల్లికార్జున్, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ తహశీల్దార్లు భిక్షపతి, సవాయి సింగ్, నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.