అక్షరటుడే, వెబ్డెస్క్ : Inspector Transfers | మల్టీ జోన్ –1 పరిదిలో పలువురు సీఐలు బదిలీ (CI Transfers) అయ్యారు. మొత్తం పది మంది ఇన్స్పెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తూ ఐజీ చంద్రశేఖర్రెడ్డి (IG Chandrasekhar Reddy) సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. లూప్లైన్లో ఉన్న కొందరికి పోస్టింగ్లు ఇవ్వగా.. కీలక పోస్టింగ్ల్లో ఉన్న వారిని ఆయా బాధ్యతల నుంచి తప్పించారు.
పాలకుర్తి సీఐ మహేందర్రెడ్డిని మహబూబాబాద్ టౌన్ పీఎస్ ఎస్హెచ్వోగా బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న పెండ్యాల దేవేందర్ను ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. ట్రాన్స్ కోలో ఉన్న కందరి వినోద్ను డిచ్పల్లి సీఐగా.. అక్కడ పని చేస్తున్న కొంక మల్లేశ్ను ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. రామగుండం ఎస్బీలో ఉన్న కరుణాకర్ను జగిత్యాల టౌన్ పీఎస్ ఎస్హెచ్వోగా.. అలాగే అక్కడ పనిచేస్తున్న వేణుగోపాల్ను ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు.
చెన్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ను జగిత్యాల రూరల్ సీఐగా.. అక్కడ పనిచేస్తున్న కృష్ణారెడ్డిని ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. అలాగే వెయిటింగ్లో ఉన్న మహేశ్ను మెదక్ టౌన్ పీఎస్ ఎస్హెచ్వోగా నియమించారు. అక్కడ కొనసాగుతున్న కొమళ్ల నాగరాజును ఐజీ ఆఫీస్కు అటాచ్ చేశారు. బదిలీ అయిన వారు అంతా సత్వరమే తమ నూతన పోస్ట్లలో రిపోర్ట్ చేయాలని ఐజీ ఆదేశించారు.