అక్షరటుడే, బాన్సువాడ: Teachers Training | బాన్సువాడ డివిజన్ (Banswada Division) పరిధిలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు పట్టణంలో మంగళవారం నుంచి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంఈవో నాగేశ్వరరావు (MEO Nageswara Rao) తెలిపారు. జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులకు, జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయులకు (Bioscience Teachers), ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులకు, జడ్పీహెచ్ఎస్ కోన బాన్సువాడ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు (Physical Education Teachers) శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా బాన్సువాడ మండలం ఎస్జీటీ, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులకు జడ్పీహెచ్ఎస్ బోర్లం పాఠశాలలో మండల స్థాయి శిక్షణ నిర్వహించినట్లు చెప్పారు.
ఆర్మూర్, బోధన్లలో..
అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మండలం, బోధన్ అర్బన్, రూరల్ పరిధుల్లో ఉపాధ్యాయులకు ఈనెల 24 వరకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆర్మూర్ ఎంఈవో రాజా గంగారాం (Armoor MEO Raja Gangaram), బోధన్ ఎంఈవో నాగయ్య తెలిపారు. ఆర్మూర్ రామ్మందిర్ పాఠశాలలో ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు ఎఫ్ఎల్ఎన్ కెపాసిటీ బిల్డింగ్పై, బోధన్లోని ఇందూరు బీఈడీ కళాశాల, ఆచన్పల్లిలో శిక్షణా ఉంటుందని వివరించారు.